పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టి.. 18ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే?

మంగళవారం, 11 జులై 2017 (15:52 IST)
తమిళనాడు కాంచీపురం జిల్లాలో 18 ఏళ్ల కుర్రాడు పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టాడు. ఆ బాత్రూమ్‌లో పక్కింటి ఆంటీ స్నానం చేసే వీడియోలను చూసి ఆనందించాడు. వివరాల్లోకి వెళితే, కాంచీపురం జిల్లా నందివరం పెరియ కులిక్కరై, వల్లువర్ కాలనీ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల దివాకర్.. పక్కింటి వివాహితపై కన్నేశాడు. దీంతో ఆమెను నగ్నంగా చూడాలనుకున్నాడు. 
 
అంతే ఆమె ఇంటి బాత్రూమ్‌లో రహస్యంగా కెమెరా పెట్టాడు. ఆపై ఆ దృశ్యాలను చూసి ఆనందించాడు. కానీ బాత్రూమ్‌లో కెమెరా వున్న విషయం ఆ వివాహితకు తెలియదు. అయితే ఓ రోజు ఆ బాత్రూమ్‌లో వివాహిత భర్త స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇంకా బాత్రూమ్‌లో కెమెరా వున్న విషయాన్ని కనుగొన్నాడు. దీంతో షాక్ అయిన అతడు.. గూడువాంజేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివాకర్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి