ఆసుపత్రికి చెల్లించాల్సిన రూ.60 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో సదరు మంత్రి రూ.60 వేలు చెల్లించారు. అయితే, ఆసుపత్రి ఆ డబ్బు తీసుకునేందుకు అంగీకరించలేదు. కారణం అవన్నీ పాత 5వందలు, వెయ్యి నోట్లు కావడమే.
నవంబర్ 8 నుంచి పాత నోట్లు రద్దు చేసినందు వల్ల, వాటిని తీసుకోవడం లేదని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే డాక్టర్లు చెప్పిన సమాధానంతో కేంద్ర మంత్రికి ఒళ్లు మండింది. పాత నోట్లను డిసెంబర్ 31వరకూ మార్చుకోవచ్చని చెప్పినా ఇలా వ్యవహరించడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఆసుపత్రి తనకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.