యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. నిన్న ఒక్కరోజే ఆందోళనకారులు వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు.