కాశీ విశ్వనాథ్ ఆలయంలో పోలీసులకు డ్రెస్ కోడ్.. నో టచ్ విధానం

సెల్వి

గురువారం, 11 ఏప్రియల్ 2024 (09:34 IST)
Kasi
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో పహారా కాసే పోలీసులకు ఇక డ్రెస్ కోడ్ అమలు కానుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్ వద్ద మోహరించిన పోలీసులు ఇప్పుడు ధోతీ-కుర్తా ధరించనున్నారు. దీనికి సంబంధించి 2018లో కూడా ఓ ప్రయోగం జరిగింది.
 
ఆలయ అధికారుల ప్రకారం, పురుష అధికారులు ధోతీ, శాలువ ధరిస్తారు.అయితే మహిళా అధికారులు సల్వార్ కుర్తా ధరిస్తారు. పోలీసు యూనిఫామ్‌లకు సంబంధించిన ప్రతికూల అవగాహనలను నివారించడానికి ఈ చర్యను తీసుకోవడం జరిగింది. కొత్త వస్త్రధారణతో పాటు, క్రౌడ్ కంట్రోల్ కోసం "నో టచ్" విధానం అమలు చేయబడుతుంది.
 
దీనిపై పోలీసు కమీషనర్, మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ, పోలీసులు రద్దీని నిర్వహించడం వల్ల భక్తులు తరచుగా అగౌరవంగా భావిస్తారు. ఆలయ పూజారుల నుంచి ఇలాంటి చర్యలను భక్తులు ఎక్కువగా స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే పోలీసులు- భక్తులు స్నేహపూర్వకంగా మెలిగేందుకు ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు. 
 
క్రౌడ్ కంట్రోల్‌లో పాల్గొన్న పోలీసుల ఇమేజ్‌ని మెరుగుపరచడానికి, సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే మార్గాలను కూడా వారు కనుగొంటున్నారని అగర్వాల్ తెలిపారు.
 
కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ తర్వాత గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 2018లో రద్దీ తక్కువగా ఉండగా, గర్భగుడి లేదా దాని తలుపుల నుండి పోలీసు అధికారులు బలవంతంగా వారిని బయటికి పంపించేస్తున్నారనే ఫిర్యాదులు వెలువడ్డాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు