పన్వెల్ క్వారంటైన్‌లోని మహిళపై అత్యాచారం!!

సోమవారం, 20 జులై 2020 (10:01 IST)
మహారాష్ట్రలోని పన్వెల్‌లో దారుణం జరిగింది. అసలే కరోనా వైరస్ సోకి క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్వెల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి స్థానికంగా ఉండే కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని ఉంచుతున్నారు. ఇలాంటి వారిలో 40 ఏళ్ల మహిళ కూడా కరోనా పాజిటివ్‌తో అక్కడ చేరింది. 
 
ఆ మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. క్వారంటైన్‌లోని మహిళలు ఉండే విభాగంలో ఆ కామాంధుడు వచ్చి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపుతోంది. అయితే ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ, క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్‌తో అక్కడున్న మహిళపై ఒక వ్యక్తి  అత్యాచారం చేశాడని.. విషయం తెలిసిన వెంటనే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 
 
మరోవైపు ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని క్వారంటైన్ సెంటర్లలో సరైన ఆహారం కూడా అందించడం లేదని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు