జామ పండు దొంగతనం చేశాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?

ఆదివారం, 6 నవంబరు 2022 (17:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జామపండు దొంగిలించాడన్న అక్కసుతో ఓ యువకుడిని కొందరు కొట్టి చంపేసారు. దీంతో తోట యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని అలీగఢ్ జిల్లా మానేనా గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రకాష్ గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా, జామ తోటలో కిందపడిన ఓ పండును తెచ్చుకున్నాడు. ఆ యువకుడు గ్రామంలోకి వస్తున్న ఓం ప్రకాష్‌ను జామతోట యజమానులు భీంసేన్, బన్సారీ గమనించి నిలదీశారు. ఆపై మిగతా గ్రామస్థులంతా కలిసి ఓం ప్రకాష్‌పై దాడి చేశారు. 
 
తోటలో జామకాయలు దొంగిలంచారన్న ఆరోపిస్తూ విచారక్షణా రహితంగా కొట్టారు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఓం ప్రకాష్ అచేతన స్థితిలోకి జారుకోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు