సమాజంలో మానవీయ విలువలు నానాటికీ మృగ్యమైపోతున్నాయి. ఒడిషా రాష్ట్రంలో జరిగిన ఈ అమానవీయ సంఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భార్య మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకుపోయేందుకు డబ్బుల్లేక 10 కిలోమీటర్లు మోసుకుపోయిన భర్త ఉదంతం కళ్ళముందు కదులుతుండగానే... అదే ఒడిశాలో మరో అమానుష చర్య జరిగింది. రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని విరిచి... వెదురు బొంగుకు మూటగట్టి ఇద్దరు వ్యక్తులతో తరలించిన ఘటన ఇపుడు కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవాఖానకు తరలించడంలో జీఆర్పీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు పూనుకొన్నారు. తీవ్రజాప్యం కావడంతో అప్పటికే శవం కొయ్యబారిపోయింది. దీంతో ఒక స్వీపర్ వృద్ధురాలి శవాన్ని కాళ్లను, నడుము ఎముకలను విరిచి ఓ గుడ్డలో మూటగట్టాడు. సోర్ రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ వరకు ఓ వెదురు కట్టెకు తగిలించుకొని మోసుకెళ్లారు.
రైల్వే సిబ్బంది తీరుతో మృతురాలి కుమారుడు రవీంద్ర నాయక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన తన తల్లి శరీరంపై కనీసం సానుభూతి ప్రదర్శించకుండా ఆమానవీయంగా ప్రవర్తించారని అన్నారు. తన తల్లి శరీరాన్ని విరిచిన స్వీపర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ప్రమోద్దాస్ మీడియాకు చెప్పారు.