దివంగత సీఎం జయలలిత ఆస్తులు ఇక తమిళ రాష్ట్రానికే చెందుతాయా? ఆమెకు వారసులు లేకపోవడమే ఇందుకు కారణమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సామాజిక వేత్త భాస్కరన్. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలిత మరణంలో మిస్టరీ, ఆపై చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రోత పుట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమ్మ ఆస్తులకు వారసులు ఎవరు అనే అంశంపై సమాచార హక్కు చట్టం కింద భాస్కరన్ ఆరా తీశారు. అయితే అమ్మకు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉన్నట్లు భాస్కరన్ తెలిపారు. అమ్మకు చట్టప్రకారం వారసుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. దీంతో జయమ్మ ఆస్తులు తమిళ రాష్ట్ర సర్కారుకే చెందాలని డిమాండ్ చేశారు.