అంతా కలి మాయ.. వరుసకు బాబాయ్.. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సహజీవనం..

సోమవారం, 7 డిశెంబరు 2020 (15:47 IST)
కలియుగం.. వావి వరసల్లేవ్. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతున్న ఎంతోమంది వావి వరసలు మరిచి దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనల రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 
 
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన కేశవకుమార్ పని నిమిత్తం ఢిల్లీలో ఉంటున్న బంధువుల దగ్గర ఉంటున్నాడు. ఏదో ఒక ఉపాధి చేసుకొని జీవిస్తున్నాడు కేశవ్ కుమార్.
 
బంధువుల ఇంటివద్ద గది అద్దెకు తీసుకున్నాడు తీరిక సమయంలో బంధువుల ఇంటికి వెళుతూ వుండేవాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న పదహారేళ్ల బాలికతో చనువుగా. మెలుగుతూ ఉండేవాడు. 
 
కానీ ఈ కామాంధుడు మాయమాటలతో సదరు బాలికను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక లవ్ ట్రాక్ తెరమీదికి తెచ్చారు ఎవరికీ తెలియకుండా నోయిడాకు తీసుకెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకుని శారీరకంగా అమ్మాయిని వాడుకున్నాడు.
 
సుమారు మూడు నెలల పాటు సదరు 16 ఏళ్ల బాలికతో కేశవ్ సహజీవనం చేశాడు. తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు