దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల ప్రియురాలిని, ఆమె ప్రియుడు భవనం ఐదవ అంతస్థు నుంచి తోసి హతమార్చాడు. ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబం నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది
జూన్ 23 సాయంత్రం, ఆ అమ్మాయి, ఆమె ప్రియుడు తౌఫిక్ తన అపార్ట్మెంట్ భవనం బాల్కనీలో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సాక్షులు, ప్రాథమిక దర్యాప్తులో ఈ వివాదం ముదరడంతో తౌఫిక్ ఆ అమ్మాయిని పైకప్పుపైకి తోయడంతో ఆమె ఐదు అంతస్తుల ఎత్తు నుండి కిందపడిపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయపడిన యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఈ జంట కొన్ని నెలలుగా ప్రేమలో వున్నారు. చిన్న చిన్న విషయాలకే వారు గొడవలు పడుతుంటారని తెలిసింది. అయితే ఐదు అంతస్థుల నుంచి ప్రియురాలిని తోసి చంపేందుకు గల కారణాల కోసం అధికారులు ప్రస్తుతం కాల్ రికార్డులు, సందేశాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబం షాక్కు గురై నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.