భారత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. విలువ రూ.2 వేల కోట్లు - పరారీలో తమిళ నిర్మాత

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (12:46 IST)
భారత్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌ అంతర్జాతీయంగా రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయించిటన్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు గుర్తించగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు సూడోపెడ్రిన్‌ అనే మాదకద్రవ్యానికి ఇతర దేశాల్లో భలే డిమాండ్ ఉంది. ఈ డ్రగ్‌ను మెథాంఫేటమిన్ తయారీలో ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ డ్రగ్‌ను కిలో రూ.1.5 కోట్ల చొప్పున విక్రయిస్తున్నార. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తున్నట్టు ఎన్సీబీకి సమాచారం. 
 
ఈ డ్రగ్‌ను హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి పొడి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిసి సముద్ర మార్గాల్లో రావాణా చేస్తున్నట్టు అదికారులు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్.సి.బి నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 50 కేజీల డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు