తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, నల్లకుబేరుడు, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు జే.శేఖర్ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు అందజేసినట్టు కోల్కతాకు చెందిన హవాలా వ్యాపారవేత్త పరస్మాల్ లోథా వెల్లడించాడు. అయితే, ఈ కొత్త కరెన్సీ నోట్లను ఎక్కడ నుంచి పొందాడో మాత్రం బహిర్గతం చేయలేదు.
కాగా, నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన శేఖర్రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్కుమార్ను రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.