పండ్లలోనే 'రారాజు'ను రుచిచూసిన 'గజరాజు'.. వీడియో వైరల్

బుధవారం, 13 మే 2020 (12:41 IST)
సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. పైగా, పండ్లలోనే రారాజు ఈ మామిడి పండు. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉంటరు. అలాంటి మామిడి పండ్ల సీజన్ వచ్చిందని గ్రహించిన ఓ గజరాజు.. మామిడి పండును రుచిచూసింది. అయితే, ఇది మామిడిపండ్ల సీజన్ అని ఆ గజరాజుకు ఎలా తెలిసిందో తెలియదుకానీ.. ఏకంగా మామిడితోపులోకి వచ్చి ఓ చెట్టును తొండంతో మెల్లగా ఊపింది. అంతే.. మామిడి పండ్లు కిందపడటంతో తన తొండంతో తీసుకుని నోట్లో మింగేసింది. అలా పండ్లలోనే రారాజు అయిన మామిడిపండును గజరాజు రుచిచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుశాంతా నందా అనే ఇండియన్ ఫారెస్ట్ అధికారి ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. 'ఇది మామిడి పళ్ల సీజన్. పండ్లలోనే రారాజుగా చెప్పుకునే మామిడిని ఈ భారీ గజరాజం రుచి చూడకుండా ఎలా ఉండగలదు. అందుకే చెట్టుని మెల్లగా ఊపుతూ.. రాలిన పళ్లను రుచి చూస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. 
 
ఈ వీడియో కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈయన తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అలాగే, ఈ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఈ ఏనుగు మామిడిపండ్లను ఎక్కడ ఆరగించిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

 

It’s mango time. How can the giant be denied to have the taste of king of fruits

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు