మార్కెట్లలో 'నకిలీ' వెల్లుల్లి.. సిమెంట్‌తో తయారు చేసింది..

సెల్వి

బుధవారం, 21 ఆగస్టు 2024 (17:54 IST)
Fake garlic
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరగడంతో, కూరగాయల మార్కెట్లలో 'నకిలీ' వెల్లుల్లి దర్శనమిస్తోంది. ఇది వినియోగదారులలో ఆందోళనను పెంచింది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో, సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లిని చూపించే వీడియో వైరల్‌గా మారింది.
 
ఒక నిమిషం వైరల్ క్లిప్‌లో నకిలీ వెల్లుల్లి సిమెంట్‌తో తయారైందని తెలిసింది. అలాగే మహారాష్ట్రలోని అకోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యాపారులు నకిలీ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు.
 
ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు కిలోకు రూ.120-180 మధ్య పలుకుతుండడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు