రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ దుర్మరణం

మంగళవారం, 27 జూన్ 2023 (15:08 IST)
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ హాస్య నటుడు, యూట్యూబర్ దేవరాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగులో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
ఈ కమెడియన్ మృతిపట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం తెలిపారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ దిల్ సే బురా లగ్తా హై చిత్రంతో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈ రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగా, అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు