ఘజియాబాద్‌ శిబిరాలను రైతన్నలు ఖాళీ చేయాల్సిందే.. ఆదేశాలు జారీ

శుక్రవారం, 29 జనవరి 2021 (10:42 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఢిల్లీలోఘాజిపూర్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఘాజీపూర్ నిరసన స్థలం నుంచి వెళ్లిపోవాలసిందిగా అన్నదాతలను ఘజియాబాద్ అధికారులు ఆదేశించారు. 
 
ఇక్కడ భారీగా పోలీసులను మోహరించడమే గాక, వారు ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు. రైతుల నిరసన శిబిరాలను తొలగించాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాల మేరకు తాము నడచుకున్నామని అధికారులు తెలిపారు. 
 
ఇక 24 గంటల్లోగా సింఘు బోర్డర్ ని ఖాళీ చేయాలని హిందూసేన కూడా రైతులకు అల్టిమేటం జారీ చేసింది. కాగా హర్యానాలో  ఓ గ్రామం గ్రామమే.. ఇక అన్నదాతల ఆందోళనకు తాము దూరమని, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లో పాల్గొన్న రైతులను తాము రానివ్వబోమని హెచ్ఛరించింది. మరో వైపు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. రైతు నేత రాకేష్ టికాయత్ ప్రభుత్వానికి లొంగిపోనున్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు