మగబిడ్డ కోసం గర్భవతి కడుపును కొడవలితో కోశాడు.. చిప్పకూడు తప్పలేదు..

సెల్వి

శనివారం, 25 మే 2024 (10:38 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఒక వ్యక్తి తన గర్భవతి అయిన తన భార్య మగబిడ్డకు జన్మనిస్తుందో లేదో తెలుసుకోవడానికి కొడవలితో ఆమె కడుపును కోశాడు. ఈ కిరాతకుడికి జీవిత ఖైదు విధించబడింది. 2020 సెప్టెంబర్‌లో బదౌన్‌లోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నా లాల్ తన భార్య అనితపై దాడి చేశాడు. 
 
ఈ జంటకు 22 ఏళ్లకే వివాహమై ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే పన్నా లాల్ తనకు మగబిడ్డ పుట్టాలని కోరుకోవడంతో తరచూ గొడవ పడేవారు. మగబిడ్డ కోసం.. అతను అనితకు విడాకులు ఇవ్వాలని, మరొక స్త్రీని వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు.
 
ఘటన జరిగిన రోజున భార్యాభర్తలు మళ్లీ పుట్టబోయే బిడ్డ విషయంలో గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన పన్నా లాల్, అనితకి మగబిడ్డ లేదా ఆడపిల్ల పుట్టిందో లేదో తెలుసుకునేందుకు అనిత కడుపు కోశాడు. ఎనిమిది నెలల గర్భిణి అయిన అనిత ప్రాణాలు కాపాడుకునేందుకు గట్టిగా కేకలు వేసింది. సమీపంలోని దుకాణంలో పనిచేసే ఆమె సోదరుడు ఆమె అరుపులు విన్నాడు. 
 
ఆమెను రక్షించడానికి వచ్చాడు. అతడిని చూసిన పన్నా లాల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనితను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా గర్భిణీ అయిన స్త్రీని వైద్యులు రక్షించగలిగారు. కానీ ఆమె గర్భస్థ శిశువు అయిన మగబిడ్డను రక్షించలేకపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు