మాస్ మహారాజా రవితేజ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్ గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ముగించుకుంది. కీలక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగిఉన్న వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.