కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 11 యేళ్లలో తన గురించి చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమేనని, అసలైన సినిమా ఇంకా మిగిలేవుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఏదేమైనా తాను చేయాల్సిన పనులను పార్టీ నిర్ణయిస్తుందని, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
"ఇప్పటివరకు చూసిందంతా న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా ఇంకా ప్రారంభంకాలేదు. కార్యకర్తలు నేను నిర్వహిస్తా. ఇటీవల రోడ్ల పనుల కంటే వ్యవసాయం ఇతర సామాజిక కార్యక్రమాలపై నేను ఎక్కువగా దృష్టిసారిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. 11 యేళ్ల మోడీ పాలన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గడ్కరీ.. విదర్భలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు కృషి చేయాలన్నదే తన కోరిక అన్నారు.