జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురి మావోల హతం

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (09:45 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలకు బుల్లెట్ గాయాలు తగలడంతో వారు గాయపడ్డారు. అలాగే సంఘటనా స్థలం నుంచి మావోల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము - ఛాత్రా జిల్లాలోని సరిహద్దులో నక్సల్స్ దాగివున్నారన్న సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఎపీఎఫ్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోయారని, మరికొందరు బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొన్నారు. 
 
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో రూ.25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు