హైదరాబాద్ శాంతిభద్రతలు, ఐఏఎస్ అధికారుల క్యాడర్ వర్గీకరణపై గవర్నర్-ప్రధానిల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ వివరించారు. రెండు రోజుల నుంచీ ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.