గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్రేలి ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, కేవలం ఒక్క ప్రాంతంలోనే 26 మంది మరణించారని చెప్పారు.
ఈ వర్షంలో భారీగా పంటలు నష్టపోయాయని, అహ్మదాబాద్లో 130 ఎమ్ఎమ్ అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. జూన్ ఐదో తేదీ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్, అస్సాం ప్రాంతాల్లో భారీ నష్టం ఏర్పడిందని వారు చెప్పారు.