ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లా గుప్తకాశీలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కారణంగా పైలెట్ నియంత్రణ కోల్పోతుండటంతో దాన్ని జాతీయ రహదారిపై ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. చార్ దామ్ యాత్ర వేళ ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు భయాందోళకు గురవుతున్నారు.