కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

ఐవీఆర్

శనివారం, 7 జూన్ 2025 (19:59 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లా గుప్తకాశీలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కారణంగా పైలెట్ నియంత్రణ కోల్పోతుండటంతో దాన్ని జాతీయ రహదారిపై ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. చార్ దామ్ యాత్ర వేళ ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు భయాందోళకు గురవుతున్నారు.
 
విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆకాశంలో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడానికి కారణాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు