ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ను కలిశానని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మాజిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష నేపథ్యంలో మాజిద్ మీడియాతో మాట్లాడుతూ.. 1993లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే టైగర్ మెమన్ను రెండు, మూడు సార్లు కలిశానని చెప్పుకొచ్చారు.
‘‘టైగర్ మెమన్కు నేనేమీ స్నేహితుడిని కాను. అతడే మా కార్యాలయానికి వచ్చి కలిసేవాడు. యాకూబ్ అరెస్ట్పై టైగర్ చాలా బాధపడేవాడు. అప్పటికే ముంబై పేలుళ్లు జరిగిపోయాయి. టైగర్ భారత మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోకి ఎక్కాడు. ఎందుకు? ఎలా? చేశావని టైగర్ను అడిగాను. పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారంతోనే ముంబై పేలుళ్లకు పాల్పడ్డానని టైగర్ చెప్పాడు’’ అని మాజిద్ చెప్పారు.