నటి రన్యా రావు బంగారాన్ని ఎక్కడ దాచి తెచ్చేవారో తెలుసా?

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (13:32 IST)
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి ఉన్నారు. ఆమె వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, దుబాయ్‌లో బంగారు కొనుగోలు చేసిన రన్యారావు.. స్విట్జర్లాండ్ వెళుతున్నట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులను నమ్మించింది. 
 
కానీ, ఆమె అక్రమ బంగారంతో భారత్‌కు చేరుకునేవారు. స్వదేశీ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు వీఐపీలను ఉపయోగించే గ్రీన్ చానెల్‌ను ఉపయోగించేవారని డీఆర్ఐ అధికారులు విచారణలో వెల్లడైంది. అలాగే, ఆమె దుబాయ్‌లో కొనుగోలు చేసే బంగారాన్ని నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలలో దాచి తెచ్చేవారని గుర్తించారు. విమానాశ్రయంలో గ్రీన్ చానెల్‌లో వెళ్లే వీఐపీలు, కస్టమ్స్ క్లియరెన్స్ లేని వస్తువులను తీసుకెళ్లేవారు. అలా రన్యా రావు పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్టు డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.  
 
గత యేడాది ఆఖరులో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె... దానిని తీసుకుని తాను స్విట్జర్లాండ్‌ వెళుతున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు వెల్లడించారు. కానీ, ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్టు వెల్లడైందని డీఆర్ఐ అధికారులు తమ అరెస్టు మెమోలో పేర్కొన్నారు. పైగా విమానాశ్రయంలో గ్రీన్ చానెల్ ద్వారా వెళుతున్నపుడు తన వద్ద సుంకాలు విధించే విలువైన వస్తువులు ఏవీ లేవని నమ్మించారు. కానీ మెటల్ డిటెక్టర్ వద్ద దొరికిపోయారు. ఆ తర్వాత బెంగుళూరు విమానాశ్రయ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఈ అంశంపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు సీబీఐ కూడా కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు