నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను పూలదండలు వేసి.. నివాళులు ఎక్కడ?

శుక్రవారం, 31 మార్చి 2017 (10:11 IST)
మరణించిన వారి ఫోటోలకు పూల దండలు వేసి నివాళులు అర్పించడాన్ని చూసి వుంటాం. అయితే మధ్యప్రదేశ్ మాజీ మంత్రి దివంగత లక్ష్మణ్‌సింగ్‌ గౌద్‌ సతీమణి మాలినీ గౌద్‌ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బతికుండగానే ముఖ్యనేతలకు దండలు వేసి నివాళులు అర్పించారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లే. 
 
చనిపోయిన తన భర్త ఫోటో పక్కనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, శివరాజ్ ఫోటోలను ఉంచి.. ముగ్గురి చిత్రపటాలకు పూలదండలు వేసింది.  ముగ్గురికీ దండలు వేసి నివాళులర్పించిన ఘటన కలకలం రేగింది. మోదీపై భక్తిని చాటుకునే క్రమంలో ఇలా చేసి వుండవచ్చని కొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం బీజేపీ తరపున ఇండోర్‌ మేయర్‌గా మాలినీ గౌద్ ఉన్నారు. ఇటీవల ఆమె తన ఇంట్లో ఓ వేడుక సందర్భంగా ఈ ముగ్గురి ఫోటోలకు దండలు వేశారు. 
 
ఈ ఘటనపై ఆ పార్టీ నాయకులెవరూ స్పందించలేదుకానీ.. నెట్టింట్లోకి ఈ ఫోటో చిక్కాక.. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోకు తెగ కామెంట్లు చేస్తున్నారు. షేర్లు, లైక్లు పేరిట ఈ ఫోటో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి