ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ఆర్థికశాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులతో అత్యవసర చర్చలు జరిపారు. కానీ, ప్రతిరోజూ సీఎం వెంట వచ్చే పలువురు మంత్రుల వాహనాలు బుధవారం కనిపించలేదు.
కాగా, తమిళనాడు సచివాలయంలో 2వ అంతస్తులో ఉన్న సీఎస్ కార్యాలయం వద్దకు ఐటీ అధికారులు భద్రతా బలగాలను వెంటబెట్టుకుని రావడంతో ‘ఏదో జరిగిందంటూ’ కలకలం రేగింది. పలువురు ఐఏఎస్ అధికారులు సచివాలయం వదిలి వెళ్లిపోయారు. వరుసగా బుగ్గ కార్లు బయటకు పరుగులు పెడుతుండడంతో ఏం జరుగుతుందో అర్థంగాక ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.