ఈ నేపథ్యంలో దేశంలో ఔషదాలు (మందులు) తయారు చేస్తున్న 17 కంపెనీల్లో మైక్రో ల్యాబ్స్ సంస్థ భారీ లాభాలు సొంతం చేసుకుని తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే మైక్రో ల్యాబ్ సంస్థ సీఎండీ దిలీప్ సురానా, ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద్ సురానా (సురానా బ్రదర్స్) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపారు.
బెంగళూరులోని కార్యాలయంతో పాటు చెన్నై, తమిళనాడు, గోవా, పంజాబ్, సిక్కీం తదితర 40 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేసి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు.
ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అధినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈ రోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు. అకౌంటెంట్గా ఉద్యోగం చేసే దిలీప్ సురానా చెన్నై నుంచి బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో ఉండేవారు.
శ్రీమంతుల జాబితాలో 94వ స్థానం
ఇప్పుడు భారతదేశంలోని 100 మంది కోటీశ్వరుల జాబితాలో సురానా బ్రదర్స్ 94వ స్థానంలో ఉన్నారు. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.