గుండె నిబ్బరానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జయలలితను చెప్పుకోవచ్చు. అలాంటి గుండెకే గుండెపోటు వచ్చింది. అసలు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితు గుండెపోటు వచ్చిదా? లేదా గుండె ఆగిందా? అనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది.
మరోవైపు.. జయలలితకు యాంజియోగ్రామ్ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 3000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పలు విద్యా సంస్థలు మాత్రం స్వతహాగా సెలవు ప్రకటించాయి.