కమల్ హాసన్‌కు పిచ్చిపట్టింది.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : బీజేపీ

గురువారం, 2 నవంబరు 2017 (16:36 IST)
దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమల్ హాసన్‌కు పిచ్చిపట్టిందంటూ మండిపడుతున్నారు. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేదని... వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ అన్నారు. 
 
కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆయన ఢిల్లీలో స్పందిస్తూ, హిందూ ఉగ్రవాదం అనే పదం వాడినందుకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమల్‌పై పరువునష్టం దావా అంశాన్ని కూడా తమిళనాడు బీజేపీ శాఖ పరిశీలిస్తోందన్నారు. 
 
అంతకుముందు కమల్ హాసన్ ఓ తమిళ పత్రికకు రాసిన వ్యాసంలో దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించారు. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. 
 
హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవికాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు