మామతో పొందుసుఖం మరిగిన మహిళ... అడ్డుగా ఉన్న భర్తను చంపేసింది..

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:34 IST)
మామ వరుసయ్యే వ్యక్తితో పొందుసుఖం మరిగిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను కర్కశంగా చంపేసింది. భర్తకు మద్యం తాపించి.. ఆ తర్వాత తలపై బండరాయితో మోది చంపేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హోస్పేట్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హోస్పేట్ టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీకి ఓ మహిళకు వివాహమై భర్త మైకేల్‌ జాన్‌(40), పిల్లలు ఉన్నారు. అయితే,మద్యానికి బానిసగా మారి తరచూ తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసింసాడు. దీంతో ఆ మహిళ భర్తతో పడకసుఖాన్ని కూడా కోల్పోయింది. 
 
ఇదేసమయంలో తన బంధువు, వరుసకు మామయ అయ్యే వినోద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గత రెండేళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వినోద్‌ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. 
 
ఈ విషయాన్ని తన ప్రియుడు వినోద్‌కు చెప్పింది. ఈయన తన స్నేహితుడు అశోక్‌, ప్రియురాలితో కలిసి రైల్వే ట్రాక్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో మైకేల్ జాన్‌ను చంపేసి, తలపై బండరాయితో మోది చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికివెళ్లారు.  
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ చేపట్టగా, ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు