రేపు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:22 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించింది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, కరిక్యూలమ్‌ కో ఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు.

ఆప్‌ ప్రభుత్వంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీరిదిద్దారు. విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు కేజీవ్రాల్‌. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నారు.

ఇక కేజీవ్రాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర వెూడిని కూడా ఆహ్వానించారు.కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకారానికి ప్రధాని వెూడి హాజరవుతారా లేదా అన్న సంగతి తెలియరాలేదు.

ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం.. ప్రధాని వెూడి ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభానికి వెళ్లనున్నారు.

ఢిల్లీ నుంచి లోకసేభకు ఎన్నికైన ఏడుగురు బిజెపి ఎంపి లు, ఎనిమిది మంది నూతన ఎమ్మెల్యేలను కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు పంపామని గోపాల్‌ రారు పీటీఐకి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు