ఎవరు నాతో ఆడుకోవట్లేదు.. వారిని అరెస్ట్ చేయండి.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు

గురువారం, 14 మే 2020 (10:07 IST)
కేరళలో ఓ బాలుడు వింతగా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తన సోదరితో పాటు ఐదుగురు బాలికలు తనతో ఆడేందుకు నిరాకరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని ఎనిమేదేళ్ల బాలుడు సాక్షాత్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో వెలుగుచూసింది. 
 
అమాయకుడైన 8ఏళ్ల ఉమర్ నిదమ్ అక్కతోపాటు బాలికలు తనతో ఆటలు ఆడటం లేదని తన తండ్రితో చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా చెబితే బాలుడు నిజంగా ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాను అబ్బాయినని తనతో లుడో, షటిల్, దొంగ పోలీసు ఆటలను అక్కతో పాటు ఐదుగురు బాలికలు ఆడటం లేదని ఉమర్ నిదర్ అనే బాలుడు కస్బా పోలీసుస్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
లాక్ డౌన్ వల్ల తాను బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి నెలకొందని, స్నేహితులతో కాకుండా అక్కతో కలిసి ఆడుకుందామంటే వారు ఎగతాళి చేస్తున్నారని మూడోతరగతి చదువుతున్న ఉమర్ నిదర్ ఇంగ్లీషులో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు ఉమేష్, నీరజ్‌లు బాలుడి ఇంటికి వచ్చి బాలుడి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపారు. తనను కూడా ఆడేందుకు అనుమతించాలని కోరినా బాలికలు తిరస్కరించారని బాలుడు పోలీసులకు చెప్పాడు. బాలుడితో కలిసి ఆడాలని తాను బాలికలకు సలహా ఇచ్చామని పోలీసు అధికారి నీరజ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు