లోక్‌సభ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

సెల్వి

శనివారం, 2 మార్చి 2024 (19:28 IST)
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది. బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, ప్రధాన కార్యదర్శి వినోద్ తాండే హాజరైన విలేకరుల సమావేశంలో పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు.
 
ఈ జాబితా ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ యుపిలోని వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ అభ్యర్థుల జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్, ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారని తావ్డే చెప్పారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనుండగా, రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నవ్‌సారి స్థానానికి పోటీ చేయనున్నారు.
 
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తపిర్ గావో అరుణాచల్ ఈస్ట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ నామినేషన్ వేయగా, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు. 
 
నిషికాంత్ దూబే జార్ఖండ్‌లోని గొడ్డా నుంచి, గీతా కోడా సింహభూమ్ నుంచి, అర్జున్ ముండా ఖుంటి నుంచి పోటీ చేయనున్నారు.
 
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు