ఇంటి పక్కనే వున్న ప్రియుడితో వివాహిత, భర్త-ప్రియుడు ఇద్దరూ బలి

గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:43 IST)
కర్ణాటకలో ఘోరం జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా భర్తతో పాటు ప్రియుడు బలయ్యాడు. పచ్చటి సంసారాన్ని నిట్టనిలువునా కూల్చేసుకుంది ఒక మహిళ. చివరకు కటాకటాల పాలైంది.
 
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా టి. నరసీపుర తాలూకా హోరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు అనే యువకుడికి సంవత్సరం క్రితం 26 యేళ్ళ యువతితో వివాహమైంది. సిద్థరాజు స్థానికంగా ప్లంబర్ పనిచేసేవాడు. ఇద్దరి జీవితం సాఫీగానే సాగిపోయేది. 
 
అయితే ఇంటి పక్కనే ఉన్న మహదేవ అనే యువకుడితో ఆ వివాహితకు రెండునెలల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంటి నుంచి వెళ్ళగానే ఆమె ప్రియుడితో కలిసి ఇంటిలోనే ఆ సంబంధాన్ని కొనసాగించింది. 
 
ఇరుగుపొరుగు ద్వారా అసలు విషయం భర్తకు తెలిసింది. నెలరోజుల క్రితం ఆమెను మందలించాడు సిద్థరాజు. అయితే ఆమెలో మార్పు రాలేదు. తన సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి చంపేందుకు నిర్ణయించుకుంది.
 
మూడురోజుల క్రితం సిద్థరాజు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడు మహదేవ, అతని స్నేహితుడి సహాయంతో వివాహిత భర్తను చంపేసింది. అయితే ఏమీ ఎరుగనట్లు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో మహిళపైనే అనుమానం రావడంతో ఆమెను గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం ఒప్పుకుంది.
 
మహదేవపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గరికి పోలీసులు వస్తారని తెలుసుకున్న మహదేవ భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు ఆ మహిళ కటాకటాల్లో ఊచలు లెక్కిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు