పటేల్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి.. 93 ఏళ్ల ముసలాయన

బుధవారం, 31 అక్టోబరు 2018 (11:41 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఆవిష్కరణ బుధవారం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ .. అంటే ఐక్యతా విగ్రహాన్ని అక్టోబరు 31వతేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే రికార్డుకెక్కనున్న అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మాత్రం 93 యేళ్ళ ముదుసలి కావడం గమనార్హం. 
 
ఆయన పేరు మహారాష్ట్రకి చెందిన రామ్‍ వన్జీ సుతార్‍. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తు ఉన్న ఆ ముసలాయన ఇప్పటికి కొన్ని వేల విగ్రహాలను తయారు చేశారు. అంతేకాకుండా అరేబియన్‍ సముద్రం మధ్య భాగంలో పెట్టే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం. 
 
జవహర్‍ లాల్‍ నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్‍ సింగ్‍ లాంటి అనేక మంది ప్రముఖుల విగ్రహాలను ఆయన రూపొందించారు. అందరి కంటే గాంధీజీ విగ్రహాలు ఎక్కువగా తయారుచేశారు. పరమవీర చక్ర పొందిన వారి విగ్రహాలను కూడా ఆయన తయారు చేస్తున్నారు. వాటిని ఇండియా గేట్‍ వద్ద నేషనల్‍ వార్‍ మెమోరియల్‍‌లో ఉంచనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు