హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన మరో కేంద్ర మంత్రి

సోమవారం, 3 ఆగస్టు 2020 (09:03 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన్ను కలిసినవారిలో కేంద్రం మంత్రి బాబులు సుప్రియో కూడా ఉన్నారు. దీంతో ఆయన కీలక ప్రకటన చేశారు. అమితాషాను శనివారం సాయంత్రం తాను కలిశానని, ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బాబుల్ ట్వీట్ చేశారు. 
 
టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేవరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోనున్నట్లు ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, అమిత్‌షాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఈయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అమిత్‌షాకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మేదాంత ఆసుపత్రికి చేరుకుని చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 

I had met Honble HM Shri @AmitShah ji day before in the evening • I am advised by Doctors to confine myself, away from my family members, for the next few days with a test to be done soon •
Shall abide with all precautionary measures as per Rules & Protocol #COVID19 #AmitShah

— Babul Supriyo (@SuPriyoBabul) August 2, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు