కరోనా ఎఫెక్ట్: చీపురు పట్టిన విద్యా మంత్రి..ఎక్కడో తెలుసా?

శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:02 IST)
కరోనా పెట్టె తిప్పలు అన్నీయిన్నీ కావు. ఒకవైపు ప్రాణభయం వెంటాడుతున్నా.. మరోవైపు చుట్టూ పరిసరాలు నీటుగా లేకపోతే మనసు ఊరుకోదు. అందుకే కరోనా భయంతో పనిమనిషి రాకపోవడంతో ఓ విద్యాశాఖ మంత్రి ఏకంగా చీపురు పట్టాల్సి వచ్చింది.

విశాల భవంతిని నిర్మించుకున్న ఆయన.. ఇంటి ముందు ఊడ్వలేక నానా తిప్పలు పడిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది కర్నాటకలో జరిగింది.
 
పారిశుద్ధ్య కార్మికురాలు రాకపోవడంతో మంత్రి ఇంటి ముందున్న రోడ్డు ఊడవలేదు. దీంతో కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ బెంగళూరులోని తన నివాసం ఎదుట రోడ్డును భార్యతో కలిసి ఊడ్చారు.

రోడ్డును స్వయంగా ఊడ్చిన మంత్రి చెత్తను స్వయంగా తొలగించారు. లాక్ డౌన్ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

లాక్ డౌన్ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో ఏర్పడిన రక్తం కొరతను తీర్చేందుకు ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంత్రి రవి కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు