తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై గవర్నర్ నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. గురువారం సాయంత్రం తమిళ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే అధినేత్ర శశికళ రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై హైకోర్టు శుక్రవారం స్పందించింది. అదే సమయంలో డిజిపి, సీఎస్ గిరిజా వైద్యనాథన్లు శుక్రవారం ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారుతారోననే భయంతో శశికళ వారితో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తోంది.