‘మీరు ప్రపంచకప్లో విజేతలుగా నిలవలేకపోయామనే ఆలోచనను మనస్సులోంచి తుడిచేయండి. కప్ను గెలిచారా లేదా అనేది అప్రస్తుతం. కానీ భారతీయుల మనస్సులను గెలిచారు. వారు నన్ను కలిసినప్పుడు అందరి ముఖాల్లో కాస్త నిరాశ, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించింది. నేను వారికి ఒకటే చెప్పాను.
ఇది మీడియా యుగం. విపరీతమైన అంచనాలతో బరిలోకి దిగి ఫలితం రాకపోతే ఇలా నిరాశ, బాధ అలుముకుంటాయి. అయితే తొలిసారిగా వారి ఓటమిని కోట్లాది మంది దేశ ప్రజలు తమదిగా తీసుకుని వారి బరువును తగ్గించారు. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగండి’ అని ప్రధాని పేర్కొన్నారు.