ప్రముఖ దర్శకేంద్రుడు రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని తలపించే సంఘటన ఒకటి బీహార్లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పగలు, ప్రతీకారాలు మనుషులకే కాదు, జంతుజీవరాశులు అన్నిటికి ఉంటాయని మరోసారి రుజువైంది. బీహార్లో రైలు డ్రైవర్లపై పగపట్టిన ఒక కోతి, అక్కడికి వచ్చే ప్రతి డ్రైవర్పై దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.