ముంబైలోని ప్రఖ్యాత జేజే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ఓంకార్ (32) జూలై 7వతేదీ రాత్రి విధులను ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నట్టు తెలిపారు. అయితే, రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో ముంబైని నవీ ముంబైను అనుసంధానించే అటల్ సేతు వంతెనపై తన కారును ఆపారు. ఆ తర్వాత ఒక్కసారిగా వంతెన పైనుంచి నీటిలోకి దూకేశారు.
గమనించిన స్థానికులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, వంతెనపై ఆపి ఉన్న కారును, అందులోని ఐఫోన్ను గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి డాక్టర్ ఓంకార్గా నిర్ధారించారు.
ప్రస్తుతం కోర్ట్ గార్డు సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా డాక్టర్ ఓంకార్ ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పిన ఆయన, ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.