నవీ ముంబైలో పెరుగుతున్న సైబర్ నేరాలు.. రూ.2.97 కోట్లు మోసం..

సెల్వి

సోమవారం, 29 జనవరి 2024 (12:10 IST)
ముంబైలో ఈ మధ్య సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. తాజాగా అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి ఓ మహిళను రూ.2.97 కోట్ల మోసం చేసినందుకు తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదైంది. 
నిందితులు గత మూడేళ్లుగా ఇతర బాధితుల నిధులను షేర్లలో పెట్టుబడి పెట్టాడని, అలాగే చర, స్థిరాస్తులను సంపాదించాడని పోలీసులు వెల్లడించారు. 
 
కానీ, నిందితులు ఎలాంటి లాభాలు అందించడంలో లేదా పెట్టుబడి పెట్టిన సొమ్మును బాధితులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. నవీ ముంబై టౌన్‌షిప్‌లోని సీవుడ్స్ ప్రాంతంలో నివాసం ఉండే మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దాని ఆధారంగా, పోలీసులు తొమ్మిది మంది వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి, ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల (నిషేధించడం) చట్టం, అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ చట్టం,  మహారాష్ట్ర డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు