నల్లధనాన్ని భారత్ తీసుకురావడం తమ స్వప్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు చెప్పుకుంటోందని, కనీసం ఓ కుందేలును కూడా విదేశాల నుంచి దేశంలోకి తీసుకురాలేరని వ్యాఖ్యానించారు. 627 మందితో కూడిన నల్ల కుబేరుల జాబితాను కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో, అర్థంలేని చర్చ నడుస్తోందని మండిపడ్డారు. నల్లధనం దేశంలోకి వచ్చే అవకాశమే లేదని తాను భావిస్తున్నానని శరద్ యాదవ్ తెలిపారు.