ఎటకారం చిత్ర యూనిట్ సేఫ్ గా ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలో నృత్య దర్శకుడు విజయ్ కన్నుమూశారనే వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేపాల్ భూకంప సమయంలో ఆయన కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు బోల్తా కొట్టిందనీ, దాంతో ఆయన మృత్యువాత పడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
నృత్య దర్శకుడు విజయ్ గుంటూరు జిల్ల బాపట్ల వాస్తవ్యుడు. తండ్రి స్టీలు సామానుల వ్యాపారం చేస్తుంటారు. బాపట్ల మార్కెట్ ప్రాంతంలో నివాసముంటున్న విజయ్ నృత్యంపై మక్కువ చూపేవాడనీ, అదే అతడిని నృత్య దర్శకుడిని చేసింది. ఐతే దురదృష్టవశాత్తూ భూకంపం ధాటికి ప్రమాదానికి లోనై ఆయన మరణించడం కుటుంబ సభ్యులను తీరని శోకంలో నింపింది. కాగా విజయ్ భౌతిక కాయాన్ని నేపాల్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.