దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

డీవీ

సోమవారం, 20 మే 2024 (17:52 IST)
Dixit Shetty, Bank of Bhagyalakshmi poste
దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో తెలుగు- కన్నడ బైలింగ్వల్ గా ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యానర్ పై హెచ్ కె  ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' అనే క్యాచి టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో దీక్షిత్ శెట్టి గన్ షూట్ చేస్తూ, కాలికి టైగర్ మాస్క్ పెట్టుకొని కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి జుధాన్ శ్యాండీ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నారు. తేజస్ ఆర్ ఎడిటర్. రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనర్.
 మే 25న 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' టీజర్ ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు