వారిని క్షమించలేం... రాష్ట్రపతి :: నిర్భయ దోషులకు త్వరలో ఉరి

శుక్రవారం, 17 జనవరి 2020 (14:58 IST)
నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అది ఈనెల 22వ తేదీన అమలు చేస్తారా? లేదా మరో 14 రోజుల తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. ఈ ముద్దాయిల ఉరిశిక్షలపై ఇప్పటికే ఢిల్లీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించాయి. దీంతో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. 'చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆయన క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే, ఇపుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంతో శిక్షను ఎపుడు అమలు చేస్తారన్నదానిపైనే సందిగ్దత నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు