నల్లధనం పంచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఒక్కొక్కరికీ రూ.3లక్షల కట్టలు.. గ్రామ ప్రజలకు పంపిణీ

గురువారం, 10 నవంబరు 2016 (12:48 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు తలపట్టుకుని కూర్చుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని కోలార్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనవద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీశాడు. ఆ నల్లధనాన్ని ప్రజలకు పంచేశాడు. దీంతో హీరో అయిపోయాడు.

నల్లధనం పంపిణీ కోసం నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, మూడు లక్షల రూపాయల చొప్పున డబ్బును కట్టలుగా కట్టి, ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎమ్మెల్యే వద్ద నల్ల డబ్బు ఉన్నదని ఈ డబ్బును ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు పంచిపెట్టేశారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు డబ్బు పంచే ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ డబ్బును వైట్ మనీ చేసేందుకే సదరు ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు ఇచ్చాడని.. వైట్ చేసుకున్నాక వారి వద్ద లాగేసుకుంటాడని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  

వెబ్దునియా పై చదవండి