దర్యాప్తు చేయకుండానే మమ్మల్ని నిందిస్తే ఎలా..? : పాక్

శుక్రవారం, 31 జులై 2015 (07:05 IST)
ఎటువంటి దర్యాప్తు లేకుండా, విచారణ లేకుండానే గురుదాస్‌పూర్ ఘటనకు పాల్పడినవారు పాకిస్తాన్ నుంచే వచ్చారని ఎలా మట్లాడుతారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజి ఖలీలుల్లా ప్రశ్నించారు. హతులైన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని భారత కేంద్ర‌ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్‌నాథ్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ స్పందించింది. 
 
ఘటనపై దర్యాప్తు చేయకుండానే ఇతరులను వేలెత్తి చూపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. దాడుల అనంతరం భారత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుదాస్ పూర్ ఘటన దురదృష్టకరమని, పరస్పర సహకారం ద్వారానే టెర్రరిజాన్ని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించడం విశేషం.

వెబ్దునియా పై చదవండి