డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొందరు అగంతకుల దాడితో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగబడిన ఆమెను.. ట్రాన్స్జెండర్ కావడం వల్ల పురుషుల వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స చేయలేదు. సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ జీవితం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది.
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రొవిన్స్లో ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చని కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను స్థానికులు పెషావర్లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు.